కర్ణాటక సరిహద్దుల్లో ఘాతుకం


వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలం సమీపంలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఓ యువతిని దుండగులు కాల్చి చంపారు. హత్య చేసి కాల్చిచంపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వి.కోట మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని సీతంపల్లి గ్రామ శివార్లలో ఈ ఘాతుకం జరిగింది. నెల క్రితం కూడా ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు ఇదే ప్రాంతంలో గొంతుకోసి హత్య చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top