నిప్పుంటుకొని మహిళకు గాయాలు
రాజాం రూరల్ : మండల పరిధిలోని దోసరిరామినాయుడువలస గ్రామంలో గురువారం రాత్రి నిప్పుంటుకొని వన్నలి పుష్ప(35)అనే మహిళ తీవ్రంగా గాయపడింది. వంట చేస్తున్న సమయంలో కిరోసిన్ స్టౌపై నుంచి వంట పాత్రను దించుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడిపోవడంతో నిప్పు అంటుకుంది. దీంతో సుమారు 70 శాతం శరీరం కాలిపోయింది. స్థానికులు క్షతగాత్రురాలిని రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు గార రవిప్రసాద్ చికిత్సనందించారు. జూనియర్ సివిల్ జడ్జి కె.కృష్ణసత్యలత బాధితురాల నుంచి శుక్రవారం ఉదయం ఆసుపత్రి ఆవరణలో వాంగ్మూలం సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మెరుగైన వైద్యం కోసం పుష్పను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు.