‘తల్లి’డిల్లుతున్నారు..
ఇన్నాళ్లూ సర్కారు ఆస్పత్రుల్లో వైద్యం కుంటుపడుతుంది అనేవారు... కానీ, కొందరు వైద్యులు తలచుకుంటే ఇలా కింద కూడా పడుతుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేద బాలింతలు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అక్కడి డాక్టర్లు చేసిన నిర్వాకానికి ఈ చిత్రం ఒక నిదర్శనం. శుక్రవారం హైదరాబాద్ బాలానగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన బాలింతలకు అక్కడి డాక్టర్లు ఆపరేషన్ చేసి ఇలా నేల మీదే పడుకోబెట్టారు. ఇదేంటని అడిగిన వారిపై కస్సుబుస్సుమన్నారు.
- హైదరాబాద్