వివాహిత ఆత్మహత్య


గోదావరిఖని(పెద్దపల్లి):

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని తిలక్‌నగర్‌లో ఆదివారం వెలుగుచూసింది. కాలనీకి చెందిన రెజీనా(34) కుటుంబ కలహాలతో సతమతమవుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.



విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృ‍తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top