షాపు తొలగించారని మహిళ ఆత్మహత్యాయత్నం


విజయనగరం మున్సిపాలిటీ : తన దుకాణాన్ని తీసేశారని మనస్తాపానికి గురైన సంతోషి అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించింది. ఈ సంఘటన విజయనగరం పట్టణంలో ఆక్రమణల తొలగింపులో భాగంగా బుధవారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను పక్కకు తీసుకెళ్లి నచ్చజెప్పి ఆత్మహత్యాయత్నాన్ని ఆపారు. మున్సిపాలిటీ వాళ్లు అకారణంగా తన తొలగించారని ఆమె ఆరోపించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top