వివాహిత ఆత్మహత్య
తాడిపత్రి : పట్టణంలోని చిన్నబజార్లో నివాసం ఉంటున్న నాగమణి (35) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.