మహిళా సైకో దాడి అవాస్తవం
సామర్లకోట : కొందరిపై మహిళా సైకో దాడి చేసిందని వస్తున్న వార్తలను పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్ ఖండించారు. గురువారం సామర్లకోటలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వార్తలు అవాస్తవమని రాజశేఖర్ తెలిపారు. వదంతులు, పుకార్లను నమ్మవద్దని రాజశేఖర్ ప్రజలను కోరారు. సైకో విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరో ఓ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేక సిరంజితో దాడి చేసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.