చలిమంటలో పడి మహిళ సజీవ దహనం


విశాఖపట్టణం: చలిమంట ఓ మహిళ ప్రాణాల్ని బలిగొంది. విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం నర్తనపల్లిలో చిలకమ్మ అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున చలిమంట కాగుతోంది. ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆమె ఆ మంటల్లో పడింది. చుట్టుపక్కల వారు రక్షించేలోపే ఘోరం జరిగిపోయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top