బాలకృష్ణ ఎందుకు రావడం లేదు?
అనంతపురం: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం జరిగిన అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశానికి ఎందుకు హాజరుకావడం లేదని జెడ్పీటీసీ సభ్యుడు రవి ప్రశ్నించారు. పని ఒత్తిడి కారణంగా కొందరు ఎమ్మెల్యేలు సమావేశాలకు రాకపోవడం మామూలేనని మంత్రి పల్లె రఘునాథరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి సమాధానంపై జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, లేపాక్షి ఉత్సవాలకు కేంద్రమంత్రులను ఆహ్వానించేందుకు బాలకృష్ణ ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 27,28 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనున్న లేపాక్షి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ను కూడా బాలకృష్ణ ఆహ్వానించారు.