శభాష్ ముద్దుకృష్ణ
♦ ఏటీఎంలో అదనంగా వచ్చిన సొమ్మును పోలీసులకిచ్చాడు
♦ యువకుని నిజాయితీని మెచ్చుకున్న సీఐ
పలమనేరు: తనకు ఏటీఎంలో అదనంగా అందిన నగదును పోలీసులకిచ్చి నిజాయితీని చాటుకున్నాడు ఓ యువకుడు. పలమనేరు పట్టణంలోని రాధాబంగ్లాకు చెందిన ముద్దుకృష్ణ మంగళవారం ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో తన ఖాతాలో నుంచి రూ.500ను డ్రా చేశాడు. అయితే అతనికి రూ.16,500 వచ్చింది. తన ఖాతాలో మొత్తం నగదు రూ.632 ఉండగా అంత డబ్బుఎలా వచ్చిందో అర్థం కాలేదు. అంతకుముందు డ్రాచేసిన వారి డబ్బు తనకు వచ్చిందని తెలుసుకున్నాడు.
దీంతో నేరుగా పోలీస్స్టేషన్కొచ్చి జరిగిన విషయాన్ని సీఐ సురేందర్ రెడ్డికి తెలిపారు. యువకుని నిజాయితీని సీఐ మెచ్చుకున్నారు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. నగదు పోగొట్టుకున్న బాధితుని వివరాలను బ్యాంకు అధికారులు సేకరించాక డబ్బును అందిస్తామని సీఐ తెలిపారు.