మతప్రాతిపదిక రిజర్వేషన్లు ఇస్తే ఊరుకోం
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్రెడ్డి
నిర్మల్టౌన్ : మతప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొరిపెల్లి శ్రావణ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్లో ఆదివారం బీజేవైఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్రెడ్డి మాట్లాడారు. మతప్రాతిపదిక రిజర్వేషన్లు ఇస్తే ఊరుకునేది లేదన్నారు.
రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనిని తిప్పికొట్టే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శి అర్జున్, బీజేపీ నిర్మల్ నగర ప్రధాన కార్యదర్శి ద్యాగ శివరామకృష్ణ, నాయకులు మాకు సాయి, సతీశ్ పాల్గొన్నారు.