'తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలి'


ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో శనివారం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ,  వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి పథకాలు, తాగునీటి సమస్యలపై అధికారులను ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.



ఆయనతోపాటు ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, జంకె వెంకట్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. తక్షణమే జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ వారు అధికారులను ఆదేశించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top