రోడ్డుప్రమాదంలో దంపతుల మృతి


ఏలూరు: అరకు విహార యాత్రకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృత్యువాతపడ్డారు. ఏలూరు ఆశ్రం జంక్షన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది.



ఈ ప్రమాదంలో వరంగల్ జిల్లా జనగామకు చెందిన దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వేసవి సెలవుల్లో అరకు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top