గుండెపోటుతో వీఆర్వో మృతి


భద్రాద్రి కొత్తగూడెం: విధి నిర్వహణలో ఉన్న ఓ రెవెన్యూ అధికారిని గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం చోటు చేసుకుంది. పినపాక మండలం గడ్డంపల్లికి చెందిన కోలం అంజమ్మ(40) అశ్వాపురంలో వీఆర్వోగా పనిచేస్తోంది. గత రెండు రోజులుగా భూ దస్తావేజుల విషయంలో పాల్వంచలోని డిప్యూటీ కల్టెర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది.

 

ఈ క్రమంలో శనివారం కార్యాలయంలో పని చేస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతిచెందింది.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top