‘వెంకటగిరి ఎమ్మెల్యే రూ.5కోట్లు డిమాండ్?’

‘వెంకటగిరి ఎమ్మెల్యే రూ.5కోట్లు డిమాండ్?’


నెల్లూరు: రాపూరు-కృష్ణపట్నం రైల్వే పనులకు రూ.5 కోట్లు ఇవ్వాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారని మాంటోకార్లో కంపెనీ సెక్రటరీ కల్పేశ్ దేశాయ్ ఆరోపించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ పనులకు ఆటంకం కలిగిస్తు, తరచు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యమని కల్పేశ్ దేశాయ్ పేర్కొన్నారు.


కాగా ఎమ్మెల్యే రామకృష్ణపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేయించడం కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లు చేయడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా  వెంకటగిరి నియోజకవర్గంలో లక్ష రూపాయల పని జరగాలన్నా ఎమ్మెల్యేకు సొమ్ము చెల్లించుకోవాల్సి వస్తోందంటూ పలువురు కాంట్రాక్టర్లు ... ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు కూడా క్లాస్ తీసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top