కేసీఆర్ అహంకారాన్ని అణచాలి: ఉత్తమ్

కేసీఆర్ అహంకారాన్ని అణచాలి: ఉత్తమ్ - Sakshi


ఖమ్మం: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుణ్యమా అని వచ్చిన తెలంగాణను తానే సాధించినట్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని, పాలేరు ఉప ఎన్నిక ఫలితాలతో ఆయన అహంకారాన్ని అణచాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు.



అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. శాసనసభ్యుడు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా సీటు ఇవ్వాలనే సంప్రదాయానికి కేసీఆర్ అడ్డుకట్ట వేశారన్నారు. సంప్రదాయాన్ని గౌరవించిన వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సమావేశంలో  జానారెడ్డి, భట్టి విక్రమార్క,  షబ్బీర్ అలీ తదితరులు మాట్లాడారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top