బైక్ దగ్ధం చేసిన ఆగంతకులు


గుంటూరు : ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనంపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ వీధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వెంకట్‌రెడ్డి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.


ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి చేరిన వెంకట్రెడ్డి బైక్ను ఇంటి ముందు పార్క్ చేశాడు.  అయితే ఈ రోజు ఉదయం లేచి చూసేసరికి బైక్ కాలి బూడిద అయింది. దీంతో వెంకట్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top