ఉగాండాలో దుండగుల కాల్పులు
మైదుకూరు టౌన్ : ఉగాండా దేశంలో ఈనెల 17వతేదీ రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో మైదుకూరు వాసి షయద్ఫరూఖ్బాషా(24) మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని సాయినాథపురంలో సయద్ ఫరూక్బాషా బోర్వెల్లో పనిచేస్తున్నాడు. గత ఏడాది ఉగాండాలో ఇంస్ట్రో బోర్వెల్ కంపెనీలో సూపర్వైజర్గా ఒప్పదం కుదర్చుకొని అక్కడికి వెళ్లాడు. ఈనెల 17వ తేదీ రాత్రి విధులు ముగించుకొని వాహనంలో నివాసానికి వెళుతుండగా మార్గ మధ్యలో దుండగులు కాల్పులు జరపడంతో సయద్ఫరూక్ అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతదేహం ఈనెల 24వ తేదీ స్వగ్రామంకు చేరుకోనున్నట్లు మృతుడి అన్న ఖలీల్బాషా తెలిపారు.
సంబంధిత వార్తలు