చెట్టును ఢీకొట్టిన బైక్‌.. ఇద్దరి మృతి


గుమ్మలక్ష్మీపురం(విజయనగరం): వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది.



మండలంలోని ఎల్విన్‌పేటకు చెందిన గంట డానియల్‌(15), బొద్దిగ లోకేష్‌(15) తాడికొండలో జరుగుతున్న జాతరకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top