డివైడర్ను ఢీకొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు
గుంతకల్లు రూరల్ : డివైడర్ను ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. మొలకలపెంటకు చెందిన ఆటో డ్రైవర్ విజయ్ ఆదివారం సాయంత్రం గుంతకల్లు నుంచి స్వగ్రామానికి బయల్దేరాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం కొత్తపల్లికి చెందిన ఆంజనేయులు కూడా ఇదే ఆటోలో ఎక్కాడు. కసాపురం సమీపంలోని మారుతీనగర్ వద్దకు వెళ్లగానే లైట్లు ఫెయిల్ కావడంతో ఆటో డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ విజయ్తోపాటు ప్రయాణికుడు ఆంజనేయులు గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు.
సంబంధిత వార్తలు