ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి): ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై చోటుచేసుకుంది. దాంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించిన వివరాలు... యాచారం మండలం గడ్డ మల్లయ్యగూడెంకు చెందిన వై.లింగం (23), మంచాల మండలం ఆరుట్లకు చెందిన ఆర్. సాయిలు (16) వరుసకు అన్నదమ్ములు.
మోపెడ్పై బొంగ్లూర్కు వెళ్లి తిరిగివస్తుండగా.. ఎదురుగుగా వస్తున్న దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఢీకొనడంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక అస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో చెరువుకట్టపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.