అగ్నిప్రమాదం: రూ.5 లక్షల ఆస్తి నష్టం
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామంలో అగ్నిప్రమాదం జరిగి రూ.5లక్షల ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు కుటుంబాలకు చెందిన పూరిళ్లు దగ్ధమయ్యాయి. లక్ష్మయ్య, చుక్కమ్మ దంపతులకు చెందిన ఇంట్లో రూ.5 వేల నగదు, తులం బంగారం, 15 క్వింటాళ్ల పత్తి, 15 కిలోల మొక్కజొన్న, ఇంటి సామగ్రి, ఉపేందర్, పద్మలకు చెందిన ఇంట్లో 20 కిలోల మొక్కజొన్న, ఇంటి సామగ్రి కాలి బూడిదయ్యాయి.