ఘట్‌కేసర్‌లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం

ఘట్‌కేసర్‌లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం - Sakshi


ఘట్‌కేసర్: రంగారెడ్డి జిల్లాలో ఆస్తి తగాదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. ఘట్‌కేసర్లోని మైసమ్మగుట్ట వద్ద ఆదివారం రాత్రి జరిగిన గొడవల్లో పలువురు గాయపడ్డారు.


రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలు ఒక్క కుటుంబంపై మరో కుటుంబం కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురికి కత్తిపోట్లు తగిలాయి. ఈ ఘటనలో గాయపడిన సంజీవ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top