లారీ ఢీకొని ఇద్దరు మృతి
వరంగల్: వరంగల్ జిల్లా ఆరేపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న రాము, కమలాకర్ అనే వ్యక్తులను వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.