రెండు బైకుల ఢీ..
-
యువకుని మృతి
నందనవనం (హనుమంతునిపాడు) : ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకోవడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నందనవనం సమీపాన గుడిపాటిపల్లి– నందనవనం రోడ్డులో మంగళవారం జరిగింది.
వివరాలు.. ఉసుళ్లపల్లికికి చెందిన కుమ్మరి వెంకటయ్య కుమారుడు శ్రీనివాసులు బైకు, వెలిగండ్ల మండలం జాల్లపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎం.ఉదయ్కుమార్ బైకు నందనవనం సమీపంలో ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషయంగా ఉండటంతో ఆటోలో కనిగిరిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాసులు (21)ను ఒంగోలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఉపాధ్యాయుని పరిస్థితి విషమయంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.