తిరుపతి, కడపలకు ట్రూజెట్ సర్వీసులు


గన్నవరం (కృష్ణా జిల్లా) : ట్రూజెట్ విమాన సంస్థ తిరుపతి-విజయవాడ, కడప-విజయవాడల మధ్య మంగళవారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించింది. వారానికి మూడు రోజులపాటు ఈ సర్వీసులు నడవనున్నాయి. ఈ సందర్భంగా విజయవాడలోని ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 15 మంది పిల్లలకు విజయవాడ-కడప మధ్య ఉచితంగా ప్రయాణించేందుకు ట్రూజెట్ అవకాశం కల్పించింది. వీరందరినీ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడపకు తీసుకువెళ్ళి, మళ్లీ విజయవాడ  తీసుకువచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top