మార్చి నుంచి ‘కేసీఆర్ కిట్’
మంత్రి హరీశ్రావు ప్రకటన
చిన్నపిల్లలకు అవసరమైన వస్తువులు..
ఆస్పత్రి నుంచి తల్లీబిడ్డలను ఇంటికి చేరుస్తాం
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకంలో స్వల్పమార్పు
జహీరాబాద్: వచ్చే మార్చి నుంచి రాష్ట్రంలో ‘కేసీఆర్ కిట్’ పేరిట కొత్త పథకాన్ని ప్రారం భించనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ప్రకటించారు. గురు వారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలకు సంబం« దించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడు పోసుకున్న మహిళకు కేసీఆర్ కిట్ పేరుతో బాలింతలు, చిన్నపిల్లలకు అవసర మైన వస్తువులతో కూడిన కిట్ అందిస్తామని చెప్పారు. సబ్బులు, నూనె, డైపర్లతోపాటు అవసరమైనవన్నీ కిట్లో ఉంటాయన్నారు. ఆస్పత్రి నుంచి తల్లీబిడ్డలను అన్ని వసతులతో ప్రభుత్వ వాహనంలో క్షేమంగా ఇంటికి పంపి స్తామని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి సమాలోచన చేస్తున్నారని హరీశ్ వివరించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యసేవలను మరింత అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.
తల్లి పేరిటే కల్యాణలక్ష్మి చెక్కులు
ఇక నుంచి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను తల్లి పేరిటే అందిస్తామని, దీనికి జహీరాబాద్ నుంచే నేడు శ్రీకారం చుట్టినట్లు మంత్రి హరీశ్రావు చెప్పారు. పెళ్లి చేసుకునే యువతి పేరిట చెక్కులను అందించడం ద్వారా భర్తతోపాటు అత్తమామలు తమ అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలని వేధిస్తు న్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పును చేశామని ఆయన చెప్పారు. అంతకుముందు మోతీమాత జాతరలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ.పాటిల్, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఎండీ.ఫరీదుద్దీన్ పాల్గొన్నారు.