కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి - Sakshi


సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కార్మికుల సమస్యల పరిష్కరానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు అన్నారు. ఈనెల 8న నిర్వహించే హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌బీ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం మహాసభ పోస్టర్‌ను మంగళవారం ఆయన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు.



మహాసభలో హోం మంత్రి నాయిని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొంటారన్నారు. పోస్టర్‌ ఆవిష్కరణలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.నారాయణ, ప్రధాన కార్యదర్శి నర్సింహ, ఉపాధ్యక్షుడు వేముల మారయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాణిక్‌ రెడ్డి, నాయకులు కిరణ్, ప్రవీణ్, రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top