ఏనుగుల దాడిలో గిరిజనుడు మృతి


శ్రీకాకుళం: పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల గుంపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తొక్కి చంపేశాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా హీరామండలం ఎగువరుగడ గ్రామంలో చోటుచేసుకుంది. అడవుల్లో నుంచి వచ్చిన ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తుండటంతో గ్రామస్థులు వాటిని తరిమికొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఓ గిరిజనుడిని ఏనుగులు తొక్కి చంపాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పంటలను నష్ట పోవడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top