బైక్ శబ్దం వచ్చిందో జాగ్రత్త
నిజామాబాద్ : విపరీతమైన శబ్దం చేస్తూ రయ్ మంటూ రోడ్డుపై వెళ్తున్న మూడు బైక్లను సోమవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత వాటిని ఆర్టీవో అధికారులకు అప్పగించగా, వాటిని సీజ్ చేశారని ట్రాఫిక్ సీఐ రామాంజనేయులు తెలిపారు. సోమవారం ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నాచౌక్ వద్ద ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సైలెన్సర్ మార్చి విపరీతమైన శబ్ద కాలుష్యం చేస్తూ దూసుకుపోతున్న ఏపీ 25 జే 3814, టీఎస్ 16 ఈకే 9630, ఏపీ 25 ఎన్ 3656 నంబరు గల బైక్లను పట్టుకున్నారు. వాటిని ఆర్టీవో అధికారులకు అప్పగించగా సీజ్ చేశారు. ఎవరైనా బైక్లకు వచ్చే ఒరిజినల్ సైలెన్సర్లు మార్చి సౌండ్ పొల్యూషన్ చేసే్త సీజ్ చేస్తామని సీఐ హెచ్చరించారు. ఇటువంటి బైక్లను పట్టుకునేందుకు స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.
సంబంధిత వార్తలు