ఇసుక ట్రాక్టర్‌ ఢీ: వ్యక్తి దుర్మరణం


కరీంనగర్‌: జిల్లాలోని వీణవంక మండలం ఎలబాక గ్రామంలో ఇసుక ట్రాక్టర్‌ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గ్రామానికి చెందిన మడ పున్నం(50) అనే వ్యక్తి పొలం వద్దకు వెళ్తున్నాడు. ఆ సమయంలో ఊటూరు గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్‌ ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top