ప్రత్యేక హోదాపై రేపు 'సాక్షి' చైతన్య పథం
-
కేటీఆర్ కన్వెన్షన్సెంటర్లో కార్యక్రమం -
హాజరుకానున్న అన్ని పార్టీల నేతలు, విద్యార్థులు, జర్నలిస్టులు, మేధావులు
సాక్షిప్రతినిధి, అనంతపురం
ప్రత్యేక హోదా అంశంపై 'సాక్షి' ఆధ్వర్యంలో బుధవారం చైతన్య పథం కార్యక్రమం జరగనుంది. 'సాక్షి' సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరగనున్న ఈ చర్చా వేదికకు సాక్షి రెసిడెంట్ ఎడిటర్ ధనుంజయరెడ్డి హాజరుకానున్నారు. 'ప్రత్యేక హోదా ఏపీ హక్కు' అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా 'చైతన్య పథం' పేరుతో 'సాక్షి' చర్చావేదికలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురంలోని కేటీఆర్ కన్వెన్షన్ హాలులో బుధవారం ఉదయం 10 గంటలకు చర్చావేదికను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, ప్రజా, కుల, మహిళా సంఘాల ప్రతినిధులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొననున్నారు.