దేవస్థానం టోల్గేట్ ఆదాయం రూ.92.64 లక్షలు
అన్నవరం:
దేవస్థానం టోల్గేట్లో చిన్నకార్లు, టూరిస్ట్బస్సులు, లారీల నుంచి టోల్ వసూలు చేయడానికి నిర్వహించిన వేలంపాట నెలకు రూ.7.72 లక్షలకు ఖరారైంది. దీంతో ఆ టోల్గేట్ ద్వారా దేవస్థానానికి ఏడాదికి రూ. 92.64 లక్షలు ఆదాయం సమకూరనుందని దేవస్థానం ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాథరావు మంగళవారం సాయంత్రం సాక్షికి తెలిపారు. గత ఏడాది ఇదే టోల్ వసూలు చేయడానికి నిర్వహించిన వేలం పాట నెలకు రూ.6.14 లక్షలు మాత్రమే. దీంతో ఈ ఏడాది అదనంగా సుమారు రూ.19 లక్షలు ఆదాయం పెరిగిందని తెలిపారు.