టాబ్లెట్‌ గొంతులో అడ్డుపడి బాలుడి మృతి

టాబ్లెట్‌ గొంతులో అడ్డుపడి బాలుడి మృతి - Sakshi


పాలకుర్తి(జనగామ): అస్వస్థతకు గురైన బాలుడు స్వయంగా టాబ్లెట్‌ వేసుకోగా.. గొంతులో అడ్డు పడటంతో ఆ బాలుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన యార శ్రీను, లలిత దంపతుల కుమారుడు యార దీక్షిత్‌(4) స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు.



ఆ బాలుడికి శనివారం తండ్రి ట్యాబ్లెట్‌ వేయబోతుండగా.. తానే వేసుకుంటానని గొంతులో వేసుకున్నాడు. ఆ ట్యాబ్లెట్‌ గొంతులో అడ్డుపడటంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో దీక్షిత్‌ మృతి చెందాడు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top