నేడు తిరుపతిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ శనివారం తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్థానిక ఇందిరా మైదానంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య, టీటీడీ బోర్డు సభ్యుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పార్టీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశమైన అనంతరం పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి.. సభ నిర్వహణకు అనుమతి మంజూరు చేశారు. అభిమానుల గొడవలు, ఏపీకి ప్రత్యేక హోదా, జనసేన భవితవ్యంపై ఆయన సభలో స్పందిస్తారని తెలిసింది.