నేడు తిరుపతిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ

నేడు తిరుపతిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ - Sakshi


సాక్షి ప్రతినిధి, తిరుపతి : జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ శనివారం తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్థానిక ఇందిరా మైదానంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య, టీటీడీ బోర్డు సభ్యుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పార్టీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశమైన అనంతరం పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి.. సభ నిర్వహణకు అనుమతి మంజూరు చేశారు. అభిమానుల గొడవలు, ఏపీకి ప్రత్యేక హోదా, జనసేన భవితవ్యంపై ఆయన సభలో స్పందిస్తారని తెలిసింది.

whatsapp channel

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top