'ఖాజా హుస్సేన్కు ఉరిశిక్ష విధించాలి'
తిరుపతి: లెక్చరర్ జరీనా బేగంపై యాసిడ్ దాడిచేసి ఆమె మరణానికి కారణమైన మాజీ భర్త ఖాజా హుస్సేన్కు ఉరిశిక్ష విధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ దాడిని ఖండిస్తూ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు.
ఈ ఏడాది జూలై 15వ తేదీన చంద్రగిరి మండలం కాలూరు క్రాస్ రోడ్డు వద్ద జరీనాబేగంపై ఆమె మాజీ భర్త ఖాజా హుస్సేన్ యాసిడ్తో దాడి చేసిన సంగతి తెలిసిందే. చెన్నై వనాగరలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె శనివారం తుది శ్వాస విడిచింది. చిత్తూరు జిల్లా పీలేరు సంజయ్గాంధీ డిగ్రీ కళాశాల్లో జరీనా బేగం హిందీ లెక్చరర్గా పనిచేసేవారు.