తిరుమల రెండో ఘాట్రోడ్డు మూసివేత

తిరుమల రెండో ఘాట్రోడ్డు మూసివేత - Sakshi


తిరుమల : తిరుమల రెండో ఘాట్ రోడ్డు వద్ద మరమ్మతులు చేస్తున్న కారణంగా బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. నిపుణుల సమక్షంలో ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు చేపట్టారు. దీంతో లింక్ రోడ్డు నుంచి మొదటి ఘాట్ రోడ్డులోకి వాహనాలు మళ్లిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.


మంగళవారం ఉదయం తిరుమల రెండో ఘాట్ వద్ద బండరాళ్లు విరిగి రోడ్డుపై పడ్డ విషయం అందరికి విదితమే.  బుధవారం తెల్లవారుజామున కూడా కొండచరియలు విరిగిపడటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు క్రేన్ సహాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దతాత్కాలికంగా రెండో ఘాట్ రోడ్డును మూసివేశారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top