'ఓటమి భయంతోనే విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి'


ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే విపక్షాలన్నీ ఒక్కటయ్యాయని ఆయన ఆరోపించారు. శుక్రవారం పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అజయ్తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలేరు ఉప ఎన్నిక మే 16వ తేదీన జరగనుంది. ఫలితాలు 19న ప్రకటిస్తారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top