ముగ్గురు దొంగలు అరెస్ట్‌: భారీగా సొత్తు స్వాధీనం


కామారెడ్డి క్రైం: కామారెడ్డి, చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుచోట్ల దొంగతనాలు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డిలోని వివిధ కాలనీలకు చెందిన పందిరి స్వామి, అంకేష్‌ మహేష్‌, సర్ని లింగం అనే ముగ్గురు కలిసి పలు దొంగతనాలకు పాల్పడ్డారు.



వీరి నుంచి 9 తులాల బంగారం, 18 తులాల వెండి, రూ.2000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కామారెడ్డి కొత్తగా జిల్లాగా ఏర్పడడంతో కలెక్టరేట్‌ కోసం నిర్మిస్తున్న భవనం నుంచి 70 నల్లాలను కూడా వీరు చోరీ చేశారు. వీటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ప్రసన్నరాణి ఆధ‍్వర్యంలో ఎస్‌ఎస్‌ఓ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై శోభన్‌బాబులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top