మచిలీపట్నంలో దోపిడి దొంగలు బీభత్సం
మచిలీపట్నం : మచిలీపట్నం పట్టణంలోని సుకర్లబాద్లో శనివారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కట్టివేసి... 40 కాసుల బంగారంతోపోటు రూ. 14 వేల నగదు అపహరించారు. అనంతరం దొంగలు పరారైయ్యారు. ఆ తర్వాత బాధితురాలు బిగ్గరగా అరవడంతో స్థానికులు స్పందించారు.
వెంటనే ఆమెను కట్టు విప్పి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... బాధితురాలిని చోరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.