వరుసగా ఆరు ఇళ్లలో చోరీ
వరంగల్ : వరంగల్ జిల్లా చేర్యాల మండలం గురువన్నపేట గ్రామంలోని ఆరు ఇళ్లలో దొంగలు పడి అందినకాడకి దోచకున్నారు. మంగళవారం తెల్లవారుజామున గ్రామంలో ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. 3 తులాల బంగారం, రూ. 1లక్ష నగదు, 20 తులాల వెండి ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు.
దాంతో బాధితులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు