చోరీకి వచ్చి చిక్కాడు
కడప : వైఎస్ఆర్ జిల్లా గాలివీడు మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోరీకి వచ్చిన దొంగల్లో ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇద్దరు దొంగలు తాళాలు వేసి ఉన్న ఓ ఇంటిలో చోరీకి యత్నించారు. ఆ క్రమంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అటువైపుగా వచ్చారు. చోరీకి పాల్పడుతున్న దొంగలు పోలీసుల కంటబడ్డారు.
దీంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఒకరు పరారీ కాగా, మరోకరు పోలీసులకు చిక్కాడు. పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించారు. ఈ సందర్భంగా తన స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె అని నిందితుడు పోలీసులకు చెప్పాడు.మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.