దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

నిందితుడి అరెస్టును చూపుతున్న పోలీసులు - Sakshi


రూ.3 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం



గణపురం (భూపాలపల్లి) : గణపురం మండలంలో వరుస దొంగ తనాలకు పాల్పడ్డ పరకాల పట్టణానికి  చెందిన గడ్డం శ్రీకాంత్‌(24)ను అరెస్ట్‌ చేసినట్లు ములుగు డీఎస్పీ దక్షిణమూర్తి, ములుగు సీఐ ఎం.సాయిరమణలు తెలిపారు. గణపురం పోలీస్‌ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. గతంలో నమోదైన చోరీ కేసుల విచారణలో భాగంగా సొమవారం మండలంలో ని గాంధీనగర్‌ గ్రామంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా శ్రీకాంత్‌ తమను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకొని విచారించినట్లు తెలిపారు.



పలువురి ఆభరణాలను తానే దొంగలించినట్లు శ్రీకాంత్‌ ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి మొత్తం 3లక్షల 8వేల రుపాయాల విలువ చేసే 96 గ్రాముల బంగారు ఆభరణాలు, అరకిలో వెండి, ఒక సెల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందుతుడిని రిమాం డ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో గణపురం ఎస్సై కొండపాక ప్రవీణ్‌కుమార్, హెడ్‌ కానిస్టేబుళ్లు షా ఖాన్, రాజన్న, కానిస్టేబుళ్లు అశోక్, సునీల్‌ తదితరులున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top