కుల సంఘంలో రాజకీయాలకు తావులేదు

కుల సంఘంలో రాజకీయాలకు తావులేదు


వినాయక్‌నగర్‌ (నిజామాబాద్‌ అర్బన్‌): కులసంఘంలో రాజకీయాలకు తావులేదని, సమష్టి కృషితో ముందుకుసాగి అభివృద్ధికి బంగారుబాటలు వేసుకుందామని నగర గోనెరెడ్డి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్సాని శేఖర్‌రెడ్డి, అంతరెడ్డి సుదర్శన్‌రెడ్డిలు అన్నారు. నగరంలోని గోనెరెడ్డి కల్యాణ మండపంలో శుక్రవారం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమష్టి కృషితో సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ అంతరెడ్డి రాజారెడ్డి, మద్దుల నందన్‌రెడ్డి, సద్ది లింగారెడ్డిలు, ప్రత్యేక ఆహ్వానితులుగా 14 వ డివిజన్‌ కార్పొరేటర్‌ అంతరెడ్డి లత, దేవేందర్‌రెడ్డిలు  హాజరయ్యారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.


నూతన కార్యవర్గం

అధ్యక్షుడు ఎల్సాని శేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అంతరెడ్డి సుదర్శన్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా మద్దుల రాజారెడ్డి, నీలకంటి రాజారెడ్డి, కోశాధికారిగా రెడ్డి రాజారెడ్డి, సంయుక్త కార్యదర్శిగా మంతెన సాయారెడ్డి, కార్యవర్గసభ్యులుగా మంతెన సుభాష్‌రెడ్డి, అంతరెడ్డి గంగారెడ్డి, ఎల్సాని రాజారెడ్డి, ఉప్పులపు నవీన్‌రెడ్డి, పాతూరి గంగాధర్‌రెడ్డి, రెడ్డి నర్సారెడ్డి, ముఖ్య సలహాదారులుగా అంతరెడ్డి రాజారెడ్డి, మద్దుల నందన్‌రెడ్డి, సద్ది లింగారెడ్డి ఎన్నికయ్యారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top