దొంగ కోసం జీపు నుంచి దూకి..
గద్వాల్: జోగులాంబ గద్వాలలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పోలీసులు అరెస్టు చేసి జీపులో తీసుకెళ్తున్న సమయంలో ఓ దొంగ జీపు దూకి పారిపోవడానికి యత్నించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు అతని పక్కనే ఉన్న కానిస్టేబుల్ రాఘవేంద్ర కూడా దొంగను పట్టుకునేందుకు జీపులో నుంచి దూకాడు.
జీపు వేగంగా వెళ్తుండటంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో తీవ్రగాయాలపాలైన రాఘవేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు.