పోలీసులమని చెప్పి దోచుకెళ్లారు..
కానిస్టేబుళ్లం అని చెప్పి ఇంట్లోకి వచ్చిన దొంగలు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించి 40 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రిటైర్డ్ ఏఎస్ఐ నారాయణ ఇంట్లోకి కానిస్టేబుళ్లం అని చెప్పి ప్రవేశించిన ఇద్దరు దుండగులు నారాయణ భార్యను బెదిరించి ఇంట్లో ఉన్న 50 సవర్ల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.