చీరాలలో రెండు చోరీలు
-
ఇంట్లో 20 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.2.60 లక్షల నగదు అపహరణ -
మద్యం దుకాణంలో రూ.43 వేల నగదు, రూ.4 వేల విలువైన మద్యం బాటిళ్లు అపహరణ
చీరాల రూరల్ : చీరాలలో ఒకేరోజు రెండు చోరీలు జరిగాయి. స్థానిక పాత ప్రసాద్ థియేటర్ సెంటర్లో నివాసముండే బొడ్డు సూర్యనారాయణ సాల్మన్ సెంటర్లో మెడికల్షాపు నిర్వహిస్తుంటాడు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులందరూ దుకాణంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని రూ.2.60 లక్షల నగదు, 20 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. చోరీ జరిగిందనే విషయాన్ని గమనించిన బాధితులు వన్టౌన్ పోలీసుస్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. వన్టౌన్ ఎస్సై నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులు వద్ద వివరాలు సేకరించారు. సమాచారం అందుకున్న క్లూస్టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించాయి.
మద్యం దుకాణంలో
స్థానిక ముక్కోణం పార్కు సెంటర్లోని ఓ మద్యం దుకాణంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు ప్రహరీ దూకి దుకాణానికి సంబంధించిన సిమెంట్ రేకులు పగులకొట్టారు. లోనికి ప్రవేశించి రూ.43 వేల నగదు, రూ.4 వేల విలువచేసే మద్యం బాటిళ్లు అపహరించారు. సమాచారం అందుకున్న క్లూస్టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు మంగళవారం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించాయి.