నగదు, బంగారం చోరీ.. డాక్యూమెంట్లకు నిప్పు


కర్నూలు: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లడంతో పాటు ఇంట్లో ఉన్న విలువైన పత్రాలకు నిప్పుపెట్టిన సంఘటన కర్నూలులోని మద్దూరునగర్‌లో సోమవారం వెలుగుచూసింది.



కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి దొంగలు పడి.. 13 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 3 లక్షల నగదును అపహరించారు. ఇంట్లో ఉన్న ముఖ్యమైన పత్రాలకు దుండగులు నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top