ప్రేమ వ్యవహారం...యువకుడి ఆత్మహత్య


ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఓ యువకుడు బలవ్మనరణానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొగుళ్ల నవీన్(18) పొరుగునే ఉన్న ముత్యంపేట గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు తెలపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సోమవారం నవీన్‌తోపాటు అతని తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలపించి, కౌన్సెలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ సోమవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని, ఆత్మహత్య చే సుకున్నాడు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top