యువకుడి ఆత్మహత్య
యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా క ళ్యాణదుర్గంలో సోమవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న వెంకటేష్(27) ఇంటి సమీపంలోని కొత్త రైల్వేస్టేషన్ వద్ద ఉన్న చింతచెట్టుకు ఉరి వేసుకొని మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.